టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం

  • ఈ నెల 8న ముగుస్తున్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం
  • టీటీడీ ఛైర్మన్ గా రెండో సారి బాధ్యతలను చేపట్టనున్న భూమన
  • ప్రస్తుతం టీటీడీలో ఛైర్మన్ సహా 35 మంది పాలకమండలి సభ్యులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఆయన టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు. ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం ఇది ఆయనకు రెండోసారి. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం టీటీడీలో ఛైర్మన్ సహా 35 మంది పాలకమండలి సభ్యులు ఉన్నారు.

Bhumana Karunakar Reddy
YSRCP
TTD
Chairmen

More Telugu News