జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం
- కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
- తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన జవాన్లు
- వారి నుంచి నాలుగు ఏకే-47 రైఫిళ్లను లాక్కెళ్లిన ఉగ్రవాది
- ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు
ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన జవాన్లు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు వివరించారు. కాగా, ఏప్రిల్, మే నెలల్లో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పదిమంది జవాన్లు అమరులయ్యారు.