ఈరోజు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్
- ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న జగన్
- ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం
- ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రత
మరోవైపు ఈరోజు కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన సీఎం పర్యటన రద్దయినట్టు సమాచారం. రానున్న సోమవారం, మంగళవారాల్లో ఈ ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి ఈ సాయంత్రం సీఎం కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.