Stock Market: సెన్సెక్స్ కు స్వల్ప నష్టాలు.. నిఫ్టీకి స్వల్ప లాభాలు

  • కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
  • 29 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడుతుండటం, వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడ్ నిర్ణయం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 66,355కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 19,680 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.33%), టాటా స్టీల్ (3.25%), ఎన్టీపీసీ (2.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.12%), టైటాన్ (1.70%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-4.01%), ఐటీసీ (-1.85%), ఎల్ అండ్ టీ (-1.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.27%).

More Telugu News