రాజాసింగ్ను కలవడంపై ఈటలకు అధిష్ఠానం మందలింపు?
- కేసీఆర్ స్థాయిని మరిచి ఎగిసిపడితే ఇలాగే ఉంటుందని హెచ్చరిక
- కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం
- తెలంగాణను పాలించే సత్తాలేక జాతీయ రాజకీయాలంటూ ఊరేగుతున్నారని ఎద్దేవా
- జాతీయస్థాయిలో ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీత
- రాజాసింగ్ ను కలవడం సరికాదని ఈటలకు అధిష్ఠానం హితవు
ఈటలకు అధిష్ఠానం మందలింపు!
ఈటల రాజేందర్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలవడంపై అధిష్ఠానం ఈటలను మందలించినట్లుగా తెలుస్తోంది. సస్పెండ్ కు గురైన రాజాసింగ్ ను కలవడం సరికాదని హితవు పలికినట్లుగా తెలుస్తోంది. ఓ వర్గాన్ని కించపరిచారనే ఆరోపణల నేపథ్యంలో రాజాసింగ్ ను గత ఆగస్ట్ లో బీజేపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈటల, రాజాసింగ్ భేటీ చర్చనీయాంశంగా మారింది.