Gaddar: ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైనట్టే: గద్దర్

  • నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ
  • ఖమ్మం వచ్చిన గద్దర్
  • కేసీఆర్ పాలనలో అడుగడుగునా నిర్బంధాలేనని వెల్లడి
  • ప్రజలు ఆంక్షలను ఛేదించుకుని బయటికి రావాలని పిలుపు
Gaddar said KCR downfall starts

ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పతనం ప్రారంభమైనట్టేనని అన్నారు. కేసీఆర్ పాలన నిర్బంధపూరితంగా నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ సమాజంపై నిర్బంధాలే పతనానికి నాంది అని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి నిర్బంధాలను ఛేదించుకుని బయటికి రావాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా గద్దర్ సీఎం కేసీఆర్ విధానాలను విమర్శిస్తూ అప్పటికప్పుడు పాట పాడారు. ఉపా కేసులు ఉన్నప్పటికీ తాను పాడటం మానేయలేదని స్పష్టం చేశారు. 

కోరుకుంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరగలననని, కానీ ఇప్పటికే తాను గద్దర్ ప్రజా పార్టీ పేరిట ఓ పార్టీ స్థాపించానని ఆయన వెల్లడించారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని, ప్రజాస్వామిక పద్ధతిలో ఆ యుద్ధాన్ని ఓట్ల రూపంలోకి మలిచేందుకు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గద్దర్ సూచించారు.

More Telugu News