సాయిచంద్ మృతదేహం చూసి హరీశ్ రావు కంటతడి
- గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ గిడ్డంగుల
కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ - తెలంగాణ ఉద్యమ గాయకుడిగా పేరు తెచ్చుకున్న సాయిచంద్
- ఆసుపత్రిలో ఆయన మృతదేహాన్ని చూసి హరీశ్ రావు భావోద్వేగం
‘నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని ఉర్రూతలూగించి, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజలకు పాట రూపంలో చెబుతున్న గొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమ గాయకుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారు. జోహార్ సాయిచంద్’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.