తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ... నేరుగా శ్రీవారి దర్శనం

Normal rush in Tirumala
  • దేశవ్యాప్తంగా వర్షాలు
  • మొదలైన విద్యా సంవత్సరం
  • తిరుమలలో సాధారణ రద్దీ
  • టోకెన్ లేకుండా వెళ్లిన భక్తులకు 4 గంటల్లోనే దర్శనం
దేశవ్యాప్తంగా వర్షాల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, క్యూ లైన్లలోకి వెళ్లిన భక్తులు నేరుగా స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. 

టోకెన్ లేకుండా వెళ్లిన భక్తులు కూడా కేవలం 4 గంటల్లోనే స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారు 3 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. 

నిన్న తిరుమల వెంకన్నను 69,143 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,145 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.38 కోట్ల ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Devotees
Lord Venkateswara
TTD

More Telugu News