పేటీఎం బ్యాచ్ వేధింపుల వెనక సజ్జల కుమారుడు.. టీడీపీ నాయకురాలు అనిత ఆరోపణ
- తెలుగు మహిళలను పేటీఎం బ్యాచ్ లక్ష్యంగా చేసుకుంటోందన్న అనిత
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తోందని ఆవేదన
- పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్న అనిత
వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ భార్యను దుండగులు అపహరించినా జగన్ స్పందించలేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఇవ్వని జగన్కు వారే బుద్ధి చెబుతారని అనిత హెచ్చరించారు.