ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల

  • ఏపీలో జూన్ 2 నుంచి 10 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
  • www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలు
  • 63 శాతం ఉత్తీర్ణత నమోదు
ఏపీలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేశారు. మొత్తం 1.87 లక్షల మంది టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఫలితాలను www.bse.ap.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. పాఠశాల లాగ్ ఇన్ లోనూ సంబంధిత విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో 63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 68 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 59 శాతం నమోదైంది. ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 2 నుంచి 10 వరకు నిర్వహించారు.


More Telugu News

Supplementary Results 10th Class Andhra Pradesh