Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూ మూవీ లాంచ్

  • యూత్ ఇప్పటికీ మరిచిపోని 'గీత గోవిందం'
  • మళ్లీ ఇంతకాలానికి సెట్ అయిన అదే కాంబినేషన్
  • దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 
  • కథానాయికగా ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్
Vijay Devarakonda New Movie Launched

విజయ్ దేవరకొండ - పరశురామ్ - దిల్ రాజు కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కనుందనే విషయం రెండు మూడు రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించనుందనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది. అనుకున్నట్టుగానే ఆ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో హీరోయిన్లపై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా షూటింగు మొదలైంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 'గీత గోవిందం' ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగును నమోదు చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పటి నుంచో  ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరిందన్న మాట. నాని జోడీగా ఒక సినిమా చేస్తున్న మృణాల్ ఠాకూర్, హఠాత్తుగా విజయ్ దేవరకొండ సరసన మెరవడం విశేషం. 

More Telugu News