Kamareddy District: నిద్రలోనే గుండెపోటుతో యువకుడి మృతి
కామారెడ్డి జిల్లా లింగంపేటలో విషాదం చోటు చేసుకుంది. జగదాంబతండాకు చెందిన బీటెక్ విద్యార్థి ప్రసాద్ నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవలే బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సాధించాడు ప్రసాద్. ఇంతలోనే తనయుడి ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.