Mustafa: నాశనం కావాలంటూ ప్రజలపై వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు.. స్థానికుల ఆగ్రహం

Locals fires on YSRCP MLA Mustafa
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరులోని 9వ డివిజన్ లో డ్రైనేజీ కాలువల శంకుస్థాపనకు ఈరోజు ముస్తఫా వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. తమ వీధిలో కాలువలు బాగున్నాయని, వాటిని పగులగొట్టి కొత్తవాటిని వేయడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గుతుందని స్థానికులు చెప్పారు. కావాలంటే అండర్ గ్రౌండ్ కాలువ వేయాలని అన్నారు. 

ఈ క్రమంలో స్థానికులకు, ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే స్థానికులపై శాపనార్థాలు పెట్టారు. నాశనం కావాలని అన్నారు. దీంతో, ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజైనా తమ వద్దకు వచ్చావా అని మండిపడ్డారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Go Back to Shorts
Mustafa
YSRCP
MLA

More Telugu News