Telangana: సహాయం సిద్ధమంటూ ఒడిశా ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వేను సంప్రదించిన తెలంగాణ

  • తగిన సహాయక చర్యలు, సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
  • సహాయక, పునరావాస కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తామన్న తెలంగాణ
  • ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారిలో తెలంగాణవారు లేరని వెల్లడి
Telangana Government ready to help on train accident issue

ఒడిశా రైళ్ల ప్రమాదానికి సంబంధించి ఎటువంటి సహాయక చర్యలకైనా సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైలు ప్రమాద ఘటనపై ఒడిశా ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులను సంప్రదించింది తెలంగాణ ప్రభుత్వం. తగిన సహాయక చర్యలు, సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలిపింది. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిలో ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

More Telugu News