కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి జగన్.. అన్ని పార్టీలు రావాలని విన్నపం!
- ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
- తాము రామని ఇప్పటికే ప్రకటించిన 19 పార్టీలు
- రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ రావాలని కోరిన జగన్
కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని మోదీకి జగన్ అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంట్ మన దేశ ఆత్మను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ భవనం దేశ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినదని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలనుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఈ అద్భుత కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఉన్న నిజమైన స్ఫూర్తితో తమ పార్టీ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటుందని చెప్పారు.