కేరళ తీరంలో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- 2.5 వేల కిలోల మెథాంఫెటమిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు
- ఆఫ్ఘనిస్థాన్ నుంచి షిప్ లో తరలిస్తున్న స్మగ్లర్లు
- పాకిస్థాన్ పౌరుడిని అరెస్టు చేసిన నేవీ అధికారులు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న ఈ షిప్ లో స్మగ్లర్లు 134 బస్తాలలో సూపర్ క్వాలిటీ మెథాంఫెటమిన్ ను తీసుకొస్తున్నారని అధికారులు చెప్పారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి కచ్చితమైన సమాచారం అందడంతో షిప్ కదలికలపై నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ షిప్ కేరళ తీరం ద్వారా శ్రీలంకకు వెళుతోందని, వెంట మరో రెండు పడవలు ఎస్కార్ట్ గా వస్తున్నాయని అధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకెళుతున్న షిప్ ను పట్టుకోవడం చూసి మిగతా రెండు బోట్లలోని స్మగ్లర్లు తప్పించుకున్నారని వివరించారు.