మళ్లీ సీఎం అయ్యేందుకు జగన్ యాగాలు నిర్వహిస్తున్నారా?: హేతువాద సంఘం
- ఈనెల 12న విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం
- రూ. 10 కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్నారని హేతువాద సంఘం ఆగ్రహం
- యాగాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్
యాగాలు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి తన సొంత డబ్బుతో నిర్వహించుకోవాలని... అధికారికంగా, ప్రభుత్వ స్థలాల్లో నిర్వహించడం సరికాదరని అన్నారు. రూ. 10 కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఈ యాగాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హేతువాద సంఘం సభ్యుడు మోతుకూరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి.. ఇలాంటి మతపరమైన క్రతువును నిర్వహించడం రాజ్యాంగాన్ని ధిక్కరించడం అవుతుందని అన్నారు. ఈ యాగంలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పాల్గొనడం రాజ్యాంగానికి వ్యతిరేకమని విమర్శించారు.