కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన జడ్జికి పదోన్నతిపై సుప్రీంలో పిటిషన్!
- జడ్జి హరీశ్ హన్ముఖ్ సహా 68 మందికి ప్రమోషన్లు
- 65 శాతం కోటా విధానం ఆధారంగా పదోన్నతి
- మే 8వ తేదీన విచారణకు రానున్న పిటిషన్
68 మంది న్యాయమూర్తులు 65 శాతం కోటా విధానం ఆధారంగా పదోన్నతి పొందారు. ఈ పదోన్నతిని సీనియర్ సివిల్ జడ్జి కేడర్ కు చెందిన ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాప్రయ మెహతా సవాల్ చేశారు. మార్చి 10న గుజరాత్ హైకోర్టు జారీ చేసిన పదోన్నతుల జాబితాను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. జ్యుడీషియల్ అధికారుల నియామకానికి గుజరాత్ హైకోర్టు... మెరిట్, సీనియారిటీ కొత్త జాబితాను విడుదల చేయాలని కూడా వారు కోరారు. హరీశ్ హన్ముఖ్ ను సూరత్ జిల్లా కోర్టులో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గా నియమించారు. ఆయనకు న్యాయాధికారిగా పదేళ్ల అనుభవం ఉంది.