నేడు చంద్రగ్రహణం.. దానికో ప్రత్యేకత!
- నేడు ‘పెనుంబ్రల్ లూనార్’
- మళ్లీ ఇలాంటి గ్రహణం కోసం 2042 వరకు ఆగాల్సిందే
- భారత్లో గ్రహణ ప్రభావం ఉండదన్న ప్లానెటరీ సొసైటీ
- వదంతులు నమ్మవద్దని సూచన
అసలేంటీ పెనుంబ్రల్ లూనార్?
సాధారణంగా చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పెనుంబ్రల్ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి వెలుపలి నీడలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు చంద్రుడు క్రమంగా చీకట్లోకి వెళ్లిపోవడం కనిపిస్తుంది కానీ, పూర్తిగా అదృశ్యం కాడన్నమాట. అంటే మనకు లీలగా కనిపిస్తూనే ఉంటాడన్నమాట. నిజానికిది ఖగోళ అద్భుతం. మళ్లీ ఇలాంటి గ్రహణం సెప్టెంబరు 2042లో కనిపిస్తుంది.
కాగా, ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఉండగా నేటితో రెండు పూర్తవుతాయి. ఏప్రిల్ 20న సూర్యగ్రహణం సంభవించగా, నేడు చంద్రగ్రహణం. అక్టోబరు 14న మరో సూర్యగ్రహణం వస్తుండగా, అక్టోబరు 28-29 తేదీల్లో రెండో చంద్రగ్రహణం సంభవిస్తుంది.