జగన్ చేసిన సంతకాలకే దిక్కు లేదు: కోటంరెడ్డి
- నెల్లూరు రూరల్ పనుల కోసం సీఎం మూడు సంతకాలు చేశారన్న కోటంరెడ్డి
- ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని విమర్శ
- అధికారానికి దూరమైనా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని వ్యాఖ్య
ఈ క్రమంలో కోటంరెడ్డి తాజాగా మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ సమస్యల పరిష్కారం కోసం జగన్ మూడు సంతకాలు చేశారని... అయినప్పటికీ ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పెట్టిన సంతకాలకే దిక్కు లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అనవసరమైన మాటలను మాట్లాడటం ఆపేసి, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని అన్నారు. తాను అధికారానికి దూరమైనా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని చెప్పారు.