తెలంగాణలో 4 సహా దేశంలో 91 ఎఫ్ఎం ట్రాన్స్ మిటర్లు ప్రారంభించిన మోదీ
- 18 రాష్ట్రాల్లో ఏర్పాటైన కేంద్రాలు
- 100.1 మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ప్రసారం
- సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్న మోదీ
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో ఏర్పాటైన నూతన ట్రాన్స్ మిటర్లు అదనంగా 2 కోట్ల జనాభాకు రేడియో కనెక్టివిటీని పెంచుతాయన్నారు. ఇవి 35 వేల చదరపు కిలోమీటర్లను కవర్ చేస్తాయని తెలిపారు. దేశంలో సాంకేతిక విప్లవం రేడియో కొత్త అవతారంలోకి మారేందుకు దోహదం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు.