న్యాయవాదులు సమ్మె చేయకూడదు: సుప్రీంకోర్టు
- విధులు కూడా బహిష్కరించకూడదని ఆదేశం
- వారి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచన
- జిల్లా స్థాయిలోనూ అలాంటి కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చన్న సుప్రీం
ఈ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారని తెలిపింది. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాల్సి వస్తే హైకోర్టు పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది. బార్ కౌన్సిల్ లోని సభ్యులెవరూ సమ్మెకు వెళ్లరాదని, విధులు బహిష్కరించకూడదని కోర్టు పునరుద్ఘాటించింది.