టీడీపీకి ఓటేసే ఒక్క కుటుంబాన్ని వైసీపీ వైపు తిప్పినా చాలు.. మనకు వేలల్లో ఓట్లు: మంత్రి ధర్మాన
- వైసీపీకి ఓటేస్తామని చెప్పేవారితో దేవుడి ఫొటోపై ప్రమాణం చేయించుకోవాలన్న మంత్రి
- ఓటర్లను ఏ,బీ,సీ గా గుర్తించాలని వలంటీర్లకు సూచన
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఉద్యోగాలు పోతాయని వలంటీర్లకు హెచ్చరిక
దూరప్రాంతాలకు వెళ్లిన వైసీపీ ఓటర్లను గుర్తించాలని వారి అడ్రస్లు సేకరించాలని అన్నారు. ఎవరైనా మాట వినకుంటే కుల పెద్దలతో మాట్లాడించాలన్నారు. ఓట్ల సేకరణ కోసం తుపాకి పట్టిన సైనికుడిలా పనిచేయాలని కోరారు. వలంటీర్లకు మంచి పేరుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఉద్యోగం పోతుందని మంత్రి హెచ్చరించారు.