బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ హన్మకొండ కోర్టులో పిటిషన్
- విచారణకు సహకరించడం లేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ
- తీర్పును రేపటికి వాయిదా వేసిన కోర్టు
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత పదో తరగతి పేపర్లు కూడా బయటకు రావడం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎస్ఎస్సీ హిందీ పేపర్ పరీక్ష ప్రారంభమయ్యాక కాసేపటికి కమలాపూర్ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా మీడియాకు రావడం... అక్కడి నుండి ఓ మాజీ మీడియా ప్రతినిధి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నాయకులకు దానిని పంపించడం జరిగింది. పరీక్ష పూర్తి కావడానికి మరో అరగంట ఉందనగా బండి సంజయ్ వాట్సాప్ కు అది వచ్చింది. దీంతో పోలీసులు బండి సంజయ్ సహా పలువురిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. ఈ కేసులో బండి సంజయ్ కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.