మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధం కావాలి: ఎర్రబెల్లి
- సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్న ఎర్రబెల్లి
- తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లారని కితాబు
- ప్రభుత్వాన్ని కూల్చాలన్న కేంద్రం యత్నాలను కేసీఆర్ తిప్పికొట్టారని వ్యాఖ్య
తెలంగాణను ముంచి అదానీకి దోచి పెడతామంటే తామెందుకు సహకరిస్తామని అన్నారు. పదో తరగతి పేపర్లు లీక్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకు వెళ్లారని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న బీజేపీ కుయుక్తులను కేసీఆర్ తెలివిగా తిప్పికొట్టారని అన్నారు.