'ది ప్రింట్' లో వచ్చిన కథనంపై జగన్ ఏం చెపుతారు?: బొండా ఉమ
- జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడన్న బొండా ఉమ
- ది ప్రింట్ వెబ్ సైట్లో జగన్ ఆస్తులపై కథనం వచ్చిందని వ్యాఖ్య
- సాక్షి ఎవరిదో జగన్ చెప్పాలని డిమాండ్
'ది ప్రింట్' వెబ్ సైట్ లో జగన్ ఆస్తులపై కథనం వచ్చిందని, దానిపై ఆయన ఏం చెపుతారని బొండా ఉమ ప్రశ్నించారు. తనకు మీడియా సంస్థలు లేవని చెపుతున్న జగన్ సాక్షి ఎవరిదో చెప్పాలని అడిగారు. కన్న తల్లిని, చెల్లిని పట్టించుకోని జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డలను ఎలా రక్షిస్తాడని ప్రశ్నించారు. బాబాయ్ వివేకాను చంపిన వారితో తాడేపల్లిలో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు.