నో బాల్స్ వేశారనుకోండి.. జాగ్రత్త: బౌలర్లకు ధోనీ సీరియస్ వార్నింగ్!
- ప్రత్యర్థి బౌలర్లపై ఓ కన్నేసి ఉంచాలన్న ధోనీ
- నో బాల్స్, వైడ్లు వేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరిక
- ఫాస్ట్ బౌలింగులో మరింత మెరుగుపడాల్సి ఉంటుందని సూచన
ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్పైనా ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐదారు సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ పిచ్పై ఆడుతున్నట్టు చెప్పాడు. పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పాడు. ఇక్కడ మంచి స్కోర్ చేయగలమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ (57) డెవోన్ కాన్వే (47) పరుగులతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం కొండంత లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.