చంద్రబాబుకు మహిళలు ఓటేస్తే వాళ్ల చెయ్యి వాళ్లే నరుక్కున్నట్టు: ధర్మాన
- శ్రీకాకుళం జిల్లాలో ఆసరా నిధుల పంపిణీ
- హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు
- సభ మధ్యలోనే వెళ్లిపోయేందుకు లేచిన మహిళలు
- వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేసిన ధర్మాన
"ఇదే కాదు మిగతా పథకాలన్నీ కూడా అధికారంలో భాగమే. సంవత్సరం తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి. వచ్చే మే తర్వాత ఓటేయడం మానేశారనుకోండి... ఇది కూడా పోతుంది" అని తెలిపారు. అయితే, మంత్రి ధర్మాన ప్రసంగిస్తుండగానే మహిళలు సభ నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. దాంతో ఆయన స్పందిస్తూ... "ఏయ్ తల్లీ... అప్పుడే వెళ్లిపోతున్నారేంటి? మీటింగ్ అయిపోవచ్చింది కదా. ఒరేయ్ ఆటోలు తీయొద్దు... స్టార్ట్ చేయకండి. ఐదు నిమిషాల్లో సభ అయిపోతుంది" అంటూ వ్యాఖ్యానించారు.