కూల్ రూఫ్ తో కరెంటు ఆదా చేయొచ్చు: మంత్రి కేటీఆర్
- మీటర్ కు రూ.300 మాత్రమే ఖర్చవుతుందన్న మంత్రి
- కరెంటు వాడకం తగ్గి మీ పెట్టుబడి తిరిగొస్తుందని వివరణ
- ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వం తరఫున శిక్షణ అందిస్తామని వెల్లడి
కూల్ రూఫ్ వల్ల మీటర్ కు కేవలం రూ.300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గి ఆ మేరకు బిల్లు కూడా తక్కువ వస్తుందని, కూల్ రూఫ్ కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున శిక్షణ అందిస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 'మన నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి కూల్ రూఫ్ కు ఉపయోగిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.