పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ
- రేపు సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం
- పరువు నష్టం కేసులో రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించిన కోర్టు
- రాహుల్ లోక్ సభ సభ్యత్యాన్ని రద్దు చేసిన లోక్ సభ సెక్రటేరియట్
ఈ క్రమంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.