సీఎం జగన్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి: బొండా ఉమ
- సీఎం జగన్ పై ధ్వజమెత్తిన బొండా ఉమ
- 98 శాతం హామీలు ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని డిమాండ్
- నవరత్నాల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శలు
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో కట్టింది ఐదు ఇళ్లేనని పార్లమెంటులో నిరూపితమైందని అన్నారు. నవరత్నాల్లో ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని బొండా ఉమ విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ప్రజలను ఫూల్స్ ని చేస్తూనే ఉన్నాడని వివరించారు.