appsc: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా

  • ఏప్రిల్ 23 నుంచి 29 దాకా జరగాల్సిన మెయిన్స్ పరీక్ష జూన్ కు వాయిదా
  • జూన్ 3 నుంచి 9వ తేదీ మధ్య నిర్వహిస్తామన్న ఏపీపీఎస్సీ
  • యూపీఎస్సీ ఇంటర్వ్యూల నేపథ్యంలోనే వాయిదా నిర్ణయం
appsc group 1 mains postponed june

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 23 నుంచి 29 దాకా జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ ను జూన్ తొలి వారానికి వాయిదా వేసింది. జూన్ 3 నుంచి 9వ తేదీ దాకా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.

2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు.. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి ఏపీ నుంచి 25 మంది దాకా గ్రూప్-1 అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే గ్రూప్-1ను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

More Telugu News