బంగళాను ఖాళీ చేస్తా.. రాహుల్ గాంధీ రిప్లై
- కోర్టు తీర్పు దృష్ట్యా రాహుల్ పై అనర్హత వేటు
- అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్కు నోటీసులు
- ఏప్రిల్ 23 లోపు ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం డెడ్లైన్
- ఈ భవనంతో ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయన్న రాహుల్
కేంద్ర నోటీసులకు రాహుల్ తాజాగా స్పందించారు. ‘‘నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నేను ఇక్కడే గడిపాను. ఈ భవనంతో ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయి. వాటన్నిటికీ కారణం ప్రజలే’’ అని ఆయన తన లేఖలో రాసుకొచ్చారు. ప్రభుత్వం తనకు పంపిన నోటీసులో అంశాలకు కట్టుబడి ఉంటానని కూడా రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఎంపీగా పార్లమెంటులో కాలుపెట్టారు. 2005 నుంచి తుగ్లక్ లేన్లోని బంగళాలో ఉంటున్నారు. ఇప్పటివరకూ ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.