క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం.. కేసీఆర్ ను కలిసిన టీఎస్ పీఎస్సీ ఛైర్మన్
- తెలంగాణలో కలకలం రేపుతున్న లీకేజ్ వ్యవహారం
- ప్రగతి భవన్ లో చర్చిస్తున్న కేసీఆర్
- కేటీఆర్, హరీశ్ రావు, సీఎస్ హాజరు
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను జనార్దన్ రెడ్డి కలిశారు. ఈ ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లిన ఆయన ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశం సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు కూడా అక్కడ ఉన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి ఏం చేయాలనే దానిపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.