Graduate MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరాహోరీ

Tight war between YCP and TDP in West Rayalaseema Graduate MLC votes counting
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ నెలకొంది. 

ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 2,019 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు రవీంద్రారెడ్డికి 56,110 ఓట్లు లభించాయి. అదే సమయంలో, ఈ ఆరు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి 54,101 ఓట్లు లభించాయి. 

అటు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ జోరు కనబరుస్తోంది. ఆరు రౌండ్ల తర్వాత కూడా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కంచర్ల శ్రీకాంత్ 23,068 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Go Back to Shorts
Graduate MLC Elections
Votes Counting
West Rayalaseema
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News