మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది.. స్టాలిన్ సంచలన ఆరోపణలు
- నాగర్కోవిల్లో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్టాలిన్
- బీహార్ కార్మికులపై దాడులు అవాస్తవమన్న సీఎం
- ప్రజలు లబ్ధిపొందడం ఇష్టంలేని కొన్ని దుష్టశక్తుల ప్రచారం మాత్రమేనని స్పష్టీకరణ
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్టు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలు లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తమిళనాడులో బీహార్ కార్మికులపై దాడులు జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. వారికి రక్షణ కల్పించాలని స్టాలిన్ను కోరారు. మరోవైపు, బీజేపీ ఈ వ్యవహారంపై మండిపడింది. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.