అదానీ స్టాక్స్ కొన్న ఎన్ఆర్ఐకి రెండు రోజుల్లోనే 3 వేల కోట్ల లాభం
- నాలుగు అదానీ కంపెనీలలో రూ.15,446 కోట్ల విలువైన వాటా కొన్న రాజీవ్ జైన్
- రెండు రోజుల్లోనే స్టాక్స్ విలువ రూ.18,548 కోట్లు పెరిగిన వైనం
- హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ కంపెనీలకు భారీ నష్టాలు
స్టాక్ మార్కెట్ లో అదానీ షేరు విలువ పెరగడంతో రెండు రోజుల్లోనే రాజీవ్ జైన్ కొన్న స్టాక్స్ విలువ రూ.18,548 కోట్లు అయింది. దాంతో, ఆయనకు రూ.3,102 కోట్ల లాభం వచ్చింది. చౌకగా లభించిన షేర్లు దీర్ఘకాలంలో విపరీతంగా బాగా పెరుగుతాయన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైన్ తెలిపారు. జైన్ గురువారం రూ.1,410.86 ధర దగ్గర అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను కొన్నారు. అప్పటి నుండి స్టాక్ ధర 33శాతం మేర పెరగడంతో ఆయన పంట పండింది.