అమెజాన్ అడవుల్లో తప్పిపోయి.. పురుగులు తిని బతికిన వ్యక్తి
- బొలీవియాకు చెందిన వ్యక్తికి ఎదురైన అనుభవం
- స్నేహితులతో కలసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పర్యటించిన జోనాదన్
- దారితప్పడంతో ప్రాణాలతో బయటపడేందుకు పోరాటం
నార్తర్న్ బొలీవియాలో తన స్నేహితుల బృందం నుంచి ఆయన తప్పిపోయారు. బతికేందుకు పురుగులు, కీటకాలు తిని, కాలికి ఉన్న షూ తీసి అందులో వర్షపు నీరు పట్టుకుని తాగినట్టు జోనాదన్ తన కథనాన్ని యూనీటెల్ టీవీతో పంచుకున్నారు. మరోవైపు ప్రమాదకరమైన జంతువుల నుంచి కాపాడుకోవడం కూడా ఆయనకు పెద్ద సవాలుగా మారింది. జోనాదన్ తప్పిపోవడంతో ఆయన కోసం కుటుంబ సభ్యులు వెంటనే అన్వేషణ ప్రారంభించారు. చివరికి 31 రోజుల తర్వాత అమెజాన్ అడవుల్లో ఆయన్ని గుర్తించారు. వంట్లో తగినంత నీరు, లవణాలు లేక, నీరసించిపోయి, 17 కిలోల బరువు తగ్గిపోయిన స్థితిలో జోనాదన్ కనిపించారు.