11 పరుగుల తేడాతో ఆరుగురు ఔట్.. 197 స్కోరుకే ఆసీస్ ఆలౌట్
- చెలరేగిన అశ్విన్, ఉమేశ్ యాదవ్
- తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 88 పరుగుల ఆధిక్యం
- 13/0తో లంచ్ బ్రేక్ కు వెళ్లిన భారత్
అయితే, హ్యాండ్స్ కోంబ్ ను ఔట్ చేసిన అశ్విన్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆసీస్ పతనం మొదలైంది. ఓవైపు అశ్విన్, మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ చెలరేగారు. అలెక్స్ క్యారీ (3), నేథన్ లైయన్ (5)ని కూడా అశ్విన్ ఔట్ చేశారు. గ్రీన్ తో పాటు మిచెల్ స్టార్క్ (3), టాడ్ మర్ఫీ (0)లను ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ కు వచ్చిన భారత్ లంచ్ విరామ సమయానికి 13/0 స్కోరుతో నిలిచింది. భారత్ ఇంకా 75 పరుగులు వెనుకబడి ఉంది.