Chiranjeevi: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ వారం భారీ సినిమాల సందడి!

  • ఈ నెల 22న అమెజాన్ ప్రైమ్ కి 'వరిసు'
  • 23వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'వీరసింహారెడ్డి'
  • 24వ తేదీ నుంచి 'ఆహా'లో 'మైఖేల్' స్ట్రీమింగ్ 
  • 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'వాల్తేరు వీరయ్య' 
OTT Movies Releasing This Week

ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. అందుకు కారణం ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఈ వారంలో ఓటీటీ సెంటర్స్ ద్వారా ఎంట్రీ ఇస్తుండటమే. విజయ్ హీరోగా రూపొందిన 'వరిసు' సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ నెల 23వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'వీరసింహా రెడ్డి' స్ట్రీమింగ్ కానుంది. జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ జోడీగా శ్రుతి హాసన్ నటించింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. డైలాగ్స్ పరంగా ఆకట్టుకున్న ఈ సినిమా, చాలా వేగంగా 100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి రూపొందించిన 'మైఖేల్' ఈ నెల 3వ తేదీనే థియేటర్స్ కి వచ్చింది. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఇక జనవరి 13న థియేటర్స్ కి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఈ సినిమాలు ఎలాంటి రిజల్టును రాబడతాయనేది చూడాలి.

More Telugu News