మా దేశం ఆల్రెడీ దివాళా తీసింది.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
- పాకిస్థాన్ దివాళా తీసిందన్న పాక్ రక్షణ మంత్రి
- గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్పైనా మంత్రి విమర్శలు
- ఇమ్రాన్ ఖాన్ చర్యలతో దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకుందని ఆరోపణ
ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో మంత్రి ఖ్వాజా ఈ వ్యాఖ్యలు చేశారు. మునుపటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపైనా ఆయన నిప్పులు చెరిగారు. దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ చర్యలే కారణమని దుయ్యబట్టారు. ఆయన మొదలెట్టిన ఆట కారణంగా ఉగ్రవాదమే పాకిస్థాన్ గమ్యంగా మారిందని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ప్రస్తుతం అసాధారణ స్థాయిలో ఆర్థికఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. ఇదిలాఉంటే..గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పొందిన పాకిస్థాన్..వాయిదాలు కట్టడంలో విఫలం కావడంతో ఐఎమ్ఎఫ్.. నిధుల జారీని నిలిపివేసినట్టు సమాచారం.