ఏపీ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, వైసీపీ నేత పాతపాటి సర్రాజు హఠాన్మరణం
- 2004లో ఉండి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపు
- గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరు
- ఇంటికి వెళ్లాక గుండెపోటుకు గురైన సర్రాజు
- 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నేత
గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.