మరోసారి బదిలీ అయిన ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్
- గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ ఆదేశాలు
- ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సింఘాల్
- గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన సీనియర్ అధికారి
దాదాపు మూడేళ్ల పాటు టీటీడీ ఈవోగా పనిచేసిన సింఘాల్ ను తర్వాత ఏపీ ప్రభుత్వం 2020లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. అనంతరం దేవాదాయ శాఖకు బదిలీ చేసింది. గతేడాది చివర్లో టీటీడీ ఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో కొన్ని రోజులు పని చేశారు. కుమారుడు చనిపోయిన కారణంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవు తీసుకోవడంతో సింఘాల్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మరోసారి బదిలీ చేయడంతో సింఘాల్ రాజ్ భవన్ లో గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు.