పండుగ పూట కుటుంబ సభ్యులతో గడపకుండా జగన్పై విమర్శలేంటి?: చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
- తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అని పెద్దిరెడ్డి ఆగ్రహం
- సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చిత్తూరు జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శ
- జగన్ కుప్పాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారన్న మంత్రి
పుంగనూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వుతూ దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా అభివృద్దిని పట్టించుకోలేదన్న పెద్దిరెడ్డి.. జగన్ ఆధ్వర్యంలో జిల్లాతోపాటు కుప్పంలోనూ అభివృద్ధి జరుగుతోందన్నారు.