Balakrishna: 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న 'వీరసింహారెడ్డి' డైరెక్టర్!

  • ఈ నెల 12వ తేదీన 'వీరసింహారెడ్డి' రిలీజ్ 
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
  • 'అన్ స్టాపబుల్ 2' వేదికపై ఈ సినిమా టీమ్ సందడి
  • ఈ నెల 13 నుంచి మొదలుకానున్న స్ట్రీమింగ్
Unstoppable 2 Update

బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'వీరసింహా రెడ్డి' సినిమాను నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్ర ద్వారా హనీరోజ్ పరిచయమవుతోంది. ఇక ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటించగా. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ఈ సినిమా టీమ్ 'అన్ స్టాపబుల్ 2' వేదికపై సందడి చేయనుంది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. 'నేను చాలా హైపర్ .. మీరు నాకంటే ఎక్కువ హైపర్' అని బాలయ్యతో అంటూ వరలక్ష్మి నవ్వేసింది. 

'మొత్తానికి ఈ సినిమాలో డబుల్ రోల్ పెట్టి, నన్ను బాగా వాడేసుకున్నావ్' అని బాలయ్య అంటే నవ్వేసిన గోపీచంద్ మలినేని, 'క్రాక్' హిట్ కి ముందు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశావట, ప్రాపర్టీస్ కూడా అమ్మేసుకున్నావ్. ఆ సమయంలో ఎలా అనిపించింది?' అని బాలయ్య అడిగితే, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు ఆయన చెప్పిన సమాధానం ఏమిటనేది 13వ తేదీన చూడాల్సిందే.

More Telugu News