Irfan Pathan: ముంబై ఖేల్‌ఖ‌తం.. ఎంఐ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఇర్ఫాన్ ప‌ఠాన్ తీవ్ర వ్యాఖ్య‌లు!

  • నిన్న‌టి కేకేఆర్‌తో మ్యాచులో ముంబై ప్ర‌ద‌ర్శ‌న‌పై పెదవి విరిచిన భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్‌
  • ఈ సీజ‌న్‌లో ముంబై క‌థ ముగిసిందని వ్యాఖ్య‌
  • మ‌రోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై దుమ్మెత్తిపోసిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌
Mumbai Indians story is finished in IPL 2024 says Irfan Pathan

నిన్న‌టి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో మ్యాచులో ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) ప్ర‌ద‌ర్శ‌న‌పై భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సీజ‌న్‌లో ముంబై క‌థ ముగిసిందని అన్నాడు. ప‌ఠాన్ మాట్లాడుతూ.. "కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయిన‌ప్పుడు న‌మ‌న్ ధీర్‌తో బౌలింగ్ చేయించ‌డంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అనుమానాలు నిజ‌మ‌య్యాయి. ఆ స‌మ‌యంలో మంచి అటాకింగ్ బౌల‌ర్ల‌తో బౌలింగ్ చేయించుంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఈ క్ర‌మంలో వెంక‌టేశ్ అయ్య‌ర్‌, మ‌నీశ్ పాండే భాగ‌స్వామ్యం కోల్‌క‌తాకు క‌లిసొచ్చింది. ఆట‌గాళ్లు సార‌ధిని స్వీక‌రించ‌డమ‌నేది చాలా ముఖ్యం. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టులో అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు" అని చెప్పుకొచ్చాడు. ఇర్ఫాన్ ప‌ఠాన్ ఎంఐ ప్ర‌ద‌ర్శ‌న‌పై మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో అది ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 

ఇక ముంబై ఇండియ‌న్స్ ఈ సీజ‌న్‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 11 మ్యాచులాడిన ముంబై కేవ‌లం 3 మ్యాచుల్లో మాత్ర‌మే గెలిచింది. దీంతో ఎంఐ ప్లేఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై జ‌ట్టు చివ‌రి నుంచి రెండో స్థానంలో కొన‌సాగుతోంది. కెప్టెన్సీ మార్పు ఆ జ‌ట్టును తీవ్రంగా దెబ్బ తీసింద‌ని క్రికెట్ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

View this post on Instagram

A post shared by Irfan Pathan (@irfanpathan_official)

  • Loading...

More Telugu News