Vande Bharat Train: సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi inaugurates Vande Bharat train between Secunderabad and Vijayawada
షార్ట్స్‌లో చూడండి
దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. 

వందేభారత్... దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. 

ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్- ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్ పూర్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.
Go Back to Shorts
Vande Bharat Train
Secunderabad
Vijayawada
Narendra Modi
Telangana
Andhra Pradesh

More Telugu News