Santhosh Shobhan: 'కల్యాణం .. కమనీయం' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • ప్రేమకథా చిత్రంగా 'కల్యాణం కమనీయం'
  • సంతోష్ జోడీకట్టిన ప్రియా భవాని శంకర్ 
  • శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన సినిమా 
  • జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల 
Kalyanam Kamaneeyam lyrical song released

సంతోష్ శోభన్ - ప్రియా భవాని శంకర్ జంటగా 'కల్యాణం కమనీయం' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఓహో ఎగిరే' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

ఈ సినిమా నుంచి వదిలిన సెకండ్ సింగిల్ ఇది. 'కాటుక కన్నే కన్నే .. మీటను నన్నే నన్నే' అంటూ ఈ పాట మొదలవుతోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. హీరో .. హీరోయిన్స్ పై చిత్రీకరించిన పాట ఇది. 

విభిన్నమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. సంతోష్ శోభన్ నుంచి ఇటీవల వచ్చిన 'మంచిరోజులొచ్చాయి' .. ' లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' సినిమాలు నిరాశపరిచాయి. అందువలన అతని ఆశలన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి.

More Telugu News