మంత్రి విడదల రజనీకి ఏపీ హైకోర్టు నోటీసులు
- అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చారంటూ పిటిషన్
- హైకోర్టును ఆశ్రయించిన రైతులు
- బెదిరించి ఎన్ఓసీ ఇచ్చారని ఆరోపణ
- విచారణ చేపట్టిన న్యాయస్థానం
రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు మంత్రి విడదల రజనీతో పాటు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మామ ప్రతాపరెడ్డి, తహసీల్దార్, సీఐ, ఎస్ఐలకు నోటీసులు జారీ చేసింది.
పిటిషన్ల నేపథ్యంలో, కోర్టు తుది నిర్ణయానికి గ్రానైట్ తవ్వకాల లీజు ఖరారు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.