రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో పాల్గొంటారన్న టీడీపీ
- మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని వెల్లడి
- కావలిలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపుపై విమర్శలు
చంద్రబాబు పర్యటనకు జగన్ సర్కారు అడ్డంకులు కలిగిస్తోందని రవిచంద్ర ఆరోపించారు. కావలిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. కందుకూరు, కావలిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ చార్జి ఇంటూరు నాగేశ్వరరావు స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు సభ, బస ప్రాంతాలను సోమవారం టీడీపీ ముఖ్యనేతలు పరిశీలించారు.